News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌‌ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈసారి నోటాకు ఓట్లు భారీగా నమోదయ్యాయి. అముదాల వలస, టెక్కలి, ఇఛ్చాపురం, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఎచ్చెర్లలో అత్యధికంగా, ఆముదాల వలసలో అత్యల్పంగా ఓట్లు పడ్డాయి. ఈసారి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో 4,270 ఓట్లు నోటాకు పడటం గమనార్హం. అయితే అత్యల్పంగా ఇఛ్చాపురంలో 744 ఓట్లు పోల్ అయ్యాయి.

Similar News

News December 8, 2025

9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

image

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.

News December 8, 2025

SKLM: PG సెట్ లేకపోయినా.. సీట్ల కేటాయింపు

image

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSC మెడికల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై.పొలినాయుడు ఆదివారం తెలిపారు. PG సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులు ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 8, 2025

SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.