News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*పలాసలో 40 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు.*వజ్రపుకొత్తూరు మండల పరిధిలో చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య. *దైవ దర్శనానికెళ్లి కాశీలో గుండె పోటుతో మృతి చెందిన టెక్కలివాసి. *రాష్ట్రంలో పోలైన అత్యధిక బ్యాలెట్ ఓట్లు శ్రీకాకుళం జిల్లాలోనే. *మద్యం మత్తులో డ్రైనేజీలో పడి మృతి చెందిన హిరమండల వాసి. *ఎచ్చెర్ల మండల పరిధిలో బోల్తాపడిన ఇసుక లారీ.*రైల్వే పనుల కారణంగా పాతపట్నం వెళ్లే రైళ్లు రద్దు

Similar News

News March 11, 2026

శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

image

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

News March 11, 2026

శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

image

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.

News March 11, 2026

కోడి పందేల శిబిరంపై దాడి: నరసన్నపేట ఎస్సై

image

నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నామని ఎస్సై బి.గణేశ్ తెలిపారు. ఈ మేరకు తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేశామని వెల్లడించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.10,700 స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.