News May 11, 2024

శ్రీకాకుళం జిల్లాలో 18.92 లక్షల ఓటర్లు.. 2,358 పోలింగ్ కేంద్రాలు

image

నిష్పక్షపాతంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18.92 లక్షల ఓటర్లకు 2358 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 1, 2025

పలాస: యాక్సిడెంట్.. యువకుడుకి తీవ్ర గాయాలు

image

పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ సమీప రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

News December 1, 2025

శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.

News December 1, 2025

శ్రీకాకుళం: రహదారి భద్రతను మెరుగుపరచడంపై చర్యలు

image

జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే బహిరంగ మద్యం తాగడం, పబ్లిక్ న్యూసెన్స్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 17,509 పైగా డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 8,594 వేలకి పైగా కేసులు కోర్టుల ద్వారా శిక్షలు, జరిమానాల రూపంలో డిస్పోజ్ అయ్యాయని ఎస్పీ చెప్పారు.