News July 31, 2024
శ్రీకాకుళం జిల్లాలో 88.34 శాతం ఇంజినీరింగ్ ప్రవేశాలు

ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశానికి తొలి విడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసింది. ఈ మేరకు కౌన్సిలింగ్ అలాట్ మెంట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొదటి విడతలో 2154 సీట్లకు 1847 ప్రవేశాలు జరిగాయి. అనంతరం తుది విడతలో 1903 మంది అభ్యర్థులకు ప్రవేశాలు జరిగాయి. మొత్తం జిల్లాలో 88.34 శాతం ప్రవేశాలు జరిగాయి.
Similar News
News December 3, 2025
ఎచ్చెర్ల: లా కోర్సు మిగులు సీట్లు భర్తీ వాయిదా

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల లా కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం డిసెంబర్ 4 న చేపట్టనున్న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ అడ్డయ్య ప్రకటన విడుదల చేశారు. లా కోర్సు స్పాట్ అడ్మిషన్స్లో భాగంగా గురువారం విద్యార్థుల సర్టీఫికేట్ల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం తదుపరి తేదీ ప్రకటించే పరిశీలనను వాయిదా వేస్తున్నామన్నారు.
News December 3, 2025
శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.
News December 3, 2025
ఎచ్చెర్ల: మహిళ హత్య?

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


