News July 1, 2024
శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యంశాలు

* శివారు భూములకు నీరు అందించడమే లక్ష్యం: కలెక్టర్ * జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆసరా పెన్షన్లు 96.8 % పంపిణీ పూర్తి* పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఉత్తమ కలెక్టర్ అవార్డు* డెంగ్యూ వ్యాధి నివారణకు చర్యలు: కలెక్టర్* ప్రజా సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలి: ఎస్పీ* గొట్టా బ్యారేజీ నుంచి 700 క్యూసెక్కుల నీటి విడుదల* నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్: ఎచ్చెర్ల* ఒడిశాలో ఎచ్ఛర్ల యువకుడి మర్డర్
Similar News
News November 24, 2025
శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.
News November 24, 2025
ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియోఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.
News November 24, 2025
ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.


