News February 15, 2025

శ్రీకాకుళం: ‘ట్రాఫిక్ నియమాలు పాటించండి’

image

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1,2 డిపో మేనేజర్లు అమర సింహుడు, శర్మ పాల్గొన్నారు. అనంతరం ప్రయాణీకులతో పాటు ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి బక్కరూ పాటించాలని, నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. 

Similar News

News March 28, 2025

వజ్రపుకొత్తూరుకు రానున్న సినీ నటి కవిత

image

వజ్రపుకొత్తూరు మండలంలోని ఒంకులూరు గ్రామానికి శుక్రవారం సినీ నటి కవిత రానున్నారు. గ్రామానికి చెందిన గుంటు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలు సందర్భంగా ఆమె రానున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారని నిర్వాహకులు తెలిపారు.

News March 28, 2025

శ్రీకాకుళం : తమ్ముడు చనిపోతే అప్పుతీర్చలేనని అన్న సూసైడ్

image

తమ్ముడు చనిపోతాడేమోనని అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన సిక్కోలులో గురువారం జరిగింది. రూరల్ SI కె. రాము కథనం..సారవకోటలోని అలుదుకు చెందిన సూరి(40),అతని తమ్ముడు గ్రానైట్ వ్యాపారం చేసేవారు. అయితే నష్టం రాగా.. ఉమామహేశ్వరరావు విషం తాగాడు. రాగోలు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు బతకడం కష్టమన్నారు. చేసిన అప్పులు తీర్చలేనని అన్న ఆసుపత్రి వద్ద తీసుకున్న గదిలో ఉరివేసుకున్నాడు. దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News March 28, 2025

సోంపేట : మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం

image

సోంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ సుంగారపు ప్రసాద్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!