News December 26, 2024

శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు-ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ గురించి అధికారులతో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు.. శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. 7390 అభ్యర్థుల్లో 6215 మంది పురుషులు, 1175 మంది మహిళా పాల్గొంటారని పేర్కొన్నారు.

Similar News

News January 18, 2025

జనసేన నాయకురాలు కాంత్రిశ్రీ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్

image

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమె మృతికి సంతాపం తెలిపారు. అనంతరం శాంతిశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆమె ఉత్తరాంధ్రలో చేపట్టిన పలు పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తనవంతు పాత్ర పోషించారన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News January 18, 2025

SKLM: కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు చేరినవారు వీరే.!

image

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా పురుష అభ్యర్థులు 327 మంది దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.

News January 18, 2025

శ్రీకాకుళం: జనసేన నాయకురాలు కాంతిశ్రీ మృతి

image

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో గొలివి ఆసుపత్రిలో చేరిన ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఈమె ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్థిక సహాయాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్థివదేహాన్ని సందర్శనార్థం 9 తర్వాత స్వగృహానికి తెస్తారని తెలిపారు.