News April 5, 2024
శ్రీకాకుళం: నాలుగు నియోజకవర్గాలో అభ్యర్థుల ప్రకటన

జైభారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పలాస -బద్రి సీతమ్మ యాదవ్, టెక్కలి -బైపల్లి పరమేశ్వర్ రావు, శ్రీకాకుళం-రాగోలు నాగ శివ, రాజాం -కుపిలి చైతన్య కుమార్ లు పోటీ చేయనున్నారు.
Similar News
News April 22, 2025
SKLM: సకల జీవులకు ప్రాణాధారం ధరణి

భూమాత కన్నతల్లితో సమానమని ఎన్ని జన్మలు ఎత్తినా కన్నతల్లి బుణం తీర్చలేమని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుడమి తల్లి ఆయుస్సును పెంచేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
News April 22, 2025
శ్రీకాకుళం: లారీ వెనుక భాగం ఢీకొని YSR విగ్రహం ధ్వంసం

రూరల్ మండలంలోని బైరి జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహం లారీ వెనుక భాగం ఢీకొనడంతో విధ్వంసానికి గురైందని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సోమవారం నరసన్నపేట నుంచి బైరి జంక్షన్ చేరుకున్న లారీ గంగమ్మ మోడ్రన్ రైస్ మిల్కు వెళ్తూ లారీని వెనుకకు తీసే క్రమంలో విగ్రహానికి ఢీకొంది.
News April 22, 2025
శ్రీకాకుళం: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

శ్రీకాకుళం జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?