News December 10, 2024

శ్రీకాకుళం: నిలిచిపోయిన పనులు ప్రారభించండి: విజయ

image

ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ కలెక్టరుకు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను కలిసి లేఖను అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో వివిధ వంతెనలను ప్రతిపాదించి సాంకేతిక అనుమతులు, పరిపాలన, ఆర్థిక అనుమతుల మంజూరు చేసి టెండర్లను కూడా పిలిచామని ఆ పనులను ప్రారంభించాలని అభ్యర్థించారు.

Similar News

News November 24, 2025

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 127 ఫిర్యాదులు అందాయాన్నారు. ప్రతి దరఖాస్తు వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు తృప్తి కలిగించే విధంగా నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు.

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.

News November 24, 2025

ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియో‌ఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.