News July 4, 2024
శ్రీకాకుళం: నూతన కలెక్టర్గా స్వప్నిల్ దినాకర్ బాధ్యతలు

శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్గా స్వప్నిల్ దినాకర్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్, డీఆర్ఓ గణపతిరావు నూతన కలెక్టర్ను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
Similar News
News December 12, 2025
శ్రీకాకుళం: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్కు కష్టమౌతోంది.
News December 12, 2025
రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఎరువులు సంబంధించి సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రటన విడుదల చేశారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 ఫోన్ చేసి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 12, 2025
శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

జిల్లాలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖుర్దా రోడ్డు డివిజన్లోని రాజ్ అథ్గర్, జోరాండా రోడ్డు మధ్య 3వ, 4వ లైన్ల ప్రారంభోత్సవం దృష్ట్యా విశాఖ-అమృత్సర్-విశాఖ (20807/08), గుణుపూర్-రూర్కెలా-గుణుపూర్(18117/18) రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ దారి మళ్లింపు ఈనెల 12, 13, 14, 16, 17, 19, 20వ తేదీలలో అమలులో ఉంటుందని GM పరమేశ్వర్ తెలిపారు.


