News February 10, 2025
శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 114 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 20వ తేదీ వరకు విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కలిపి 164 ఉండగా ప్రాక్టికల్స్ పరీక్షలకు 15వేలు పైచిలుకు విద్యార్థులు హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప్రాక్టికల్స్కు హాజరుకానున్నారు.
Similar News
News March 22, 2025
సంతబొమ్మాళి యువకుడికి రూ.1.3 కోట్ల కొలువు

సంతబొమ్మాళి మండలం ఉద్దండపాలెంకు చెందిన హనుమంతు సింహాచలంకు పోలాండ్ దేశంలో రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. విశాఖలో MHRM విద్య పూర్తిచేసిన యువకుడు పోలాండ్లో ఒక డైరీ సంస్థలో HR Assistant గా ఎంపికయ్యారు. ఈ మేరకు యువకుడిని గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు.
News March 22, 2025
ఎమ్మెల్సీ దువ్వాడకు డాక్టరేట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు “DAYSPRING INTERNATIONAL UNIVERSITY” డాక్టరేట్ను ప్రధానం చేసింది. ఈ మేరకు తాజాగా శుక్రవారం హైదరాబాద్ యూనివర్సిటీలో తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.
News March 22, 2025
ఎచ్చెర్ల : 65 ఏళ్ల వయసులో LLB పరీక్ష

బీకే కళావతి అనే మహిళ 65 ఏళ్ల వయస్సులో శ్రీకాకుళంలోని ప్రైవేట్ న్యాయ కళాశాలలో ఐదేళ్ల L.L.B చదువుతున్నారు. ప్రస్తుతం ఈమె ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో LLB మూడో సెమిస్టర్ పరీక్ష రాస్తున్నారు. ఈమెది తమిళనాడు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు మేరకు దేశంలో ఎక్కడైనా న్యాయ విద్య చదివే అవకాశం ఉంది.