News June 13, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

వేసవి సెలవుల అనంతరం దాదాపు నెలన్నర తరువాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేసే విద్యాకానుక కిట్ల సరఫరాను ప్రభుత్వం పూర్తి చేసింది.
Similar News
News November 20, 2025
ఈ ఉద్యమమే టెక్ శంకర్ను మావోయిస్టుగా మార్చింది

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.
News November 20, 2025
శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.


