News March 13, 2025

శ్రీకాకుళం: నేడు ఈ మండలాలకు ఆరంజ్ అలర్ట్ 

image

శ్రీకాకుళం జిల్లాలో గురువారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.*పోలాకి 37.6*నరసన్నపేట 37.8 *జి.సిగడం 40.6*ఎచ్చెర్ల 37.6* శ్రీకాకుళం 38*లావేరు 38.4 *పోలాకి 37.6*పొందూరు 39.6

Similar News

News March 14, 2025

జలుమూరు: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

image

జలుమూరు మండలంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అబ్బాయిపేట గ్రామంలో ఎర్రన్నపేట గ్రామానికి చెందిన బలగ మణికంఠ ఓ వివాహ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైట్ల అలంకరణ చేపట్టాడు. ఈ క్రమంలో యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం నరసన్నపేట తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

News March 14, 2025

SKLM: పలాసలో 23న స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ సభ

image

పలాస మండలం మా కన్నపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్‌ల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

News March 14, 2025

శ్రీకాకుళం: పాఠశాలలకు నేడు సెలవు.. రేపటినుంచి ఒంటి పూట బడులు

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ శనివారం నుంచి ఒంటి పూట బడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 7:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి.  అయితే మధ్యాహ్న భోజనం యథాతథంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!