News January 17, 2025

 శ్రీకాకుళం: నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

image

శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనునట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News December 24, 2025

ఈ నెల 26న మీ చేతికి మీ భూమి: మంత్రి

image

మీ చేతికి మీ భూమి 22 ఏ భూస్వేచ్ఛ పేరుతో ప్ర‌త్యేక డ్రైవ్ ను ఈ నెల 26న శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల విష‌య‌మై ఎవ్వ‌రైనా విజ్ఞాప‌న‌లు చేసుకోవ‌చ్చ‌న్నారు. సంబంధిత అర్జీల‌ను రెవెన్యూ అధికారులు ప‌రిశీలించి, న్యాయం చేస్తారన్నారు.

News December 24, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు GOOD NEWS

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్‌లను నడపనున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం-సికింద్రాబాద్-శ్రీకాకుళం నంబర్ (07288/89) గల రైలును నడపనున్నట్లు తెలిపింది.

News December 24, 2025

26న రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ: కలెక్టర్

image

అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా, అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 25న జరగనున్న వేడుకలను ఈసారి ఏడు రోజులగా జరుపుతున్నామన్నారు. ఏర్పాట్లుపై నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.