News November 30, 2024
శ్రీకాకుళం: నేడే పెన్షన్ అందజేత

శ్రీకాకుళం జిల్లాలో నేడే పింఛను లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,14,386 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతినెల రూ.129 కోట్లకు పైగా నగదును అందజేస్తోంది. ఇప్పటికే నగదును బ్యాంకుల్లో జమ చేయగా సచివాలయ సిబ్బంది విత్ డ్రా చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు స్వయంగా సిబ్బంది అందజేయనున్నారు. కాగా ఆదివారం సెలవు కావడంతో శనివారం అందజేస్తారు.
Similar News
News December 20, 2025
శ్రీకాకుళం: ‘పోలియో విజయవంతం చేయాలి’

రేపు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని శ్రీకాకుళం DM&HO అనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆమె కార్యాలయ నుంచి ఏడూ రోడ్ల కూడలి వరకు ర్యాలీ ప్రారంభించారు. 0 – 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. శతశాతం లక్ష్యం సాధించేలా కృషిచేయాలన్నారు. మోబైల్ టీమ్లు ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయన్నారు.
News December 20, 2025
SKLM: RTC డోర్ డెలివరీ పార్సిల్ ప్రారంభం

ఆర్టీసీ సంస్థలో పార్సిల్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కార్గో పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం ప్రారంభించారు. 50 కేజీల బరువున్న పార్సిల్ 10 కిలోమీటర్లు దూరం పరిధిలో ఉన్న స్థలాలకు సురక్షితంగా పంపించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 84 పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభించాన్నారు.
News December 20, 2025
శ్రీకాకుళం: హాట్ హాట్గా జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళంలో జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్ హాట్గా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, RBKల నిర్మాణాల పనుల బిల్లులు రాలేదని సభ్యులు ప్రశ్నించగా సంబంధిత అధికారులు బిల్లులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగజేసుకున్నారు. అయితే కేవలం వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో సభ హీట్ ఎక్కింది.


