News March 30, 2024
శ్రీకాకుళం: పత్రికలు పంచడానికి వెళ్లి వరుడు దుర్మరణం

త్వరలో పెళ్లి కావాల్సిన వాలంటీర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన రేగడి మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా, కోయకొండ గ్రామానికి చెందిన షణ్ముఖరావ్ గ్రామ వాలంటీర్గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 20 వివాహం ఖాయమైంది. పెళ్లి పత్రికల పంపిణీ కోసం ఇద్దరు స్నేహితులతో బంధువుల ఇంటికి బయలుదేరాడు. కె. అగ్రహారం సీమపంలో లారీని తప్పించబోయి ఆటోను డీ కొట్టడంతో షణ్ముఖరావ్ మృతి చెందాడు.
Similar News
News October 30, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

★పొందూరులో 50 గ్రామాలకు రాకపోకలు బంద్
★సోంపేట ప్రభుత్వ పాఠశాలలో కూలిన చెట్టు
★పంటపొలాలు, వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు కూన, బగ్గు, బెందాళం
★నందిగం: కోతకు గురైన R&B రోడ్డు.. తక్షణ చర్యలు
★పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన పాతపట్నం ఎమ్మెల్యే
★కాశీబుగ్గలో పలు మెడికల్ షాపుల్లో దొంగతనాలు
★పలాస: వరహాల గెడ్డలో వ్యక్తి గల్లంతు
★ నారాయణపురం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి
News October 29, 2025
శ్రీకాకుళం: పొలాల్లో వాన నీరు..రైతు కంట కన్నీరు

‘మొంథా’ తుపాన్ ప్రభావానికి భారీ వర్షాలు, ఈదురు గాలులకు శ్రీకాకుళం జిల్లాలోని 2,230.29 హెక్టారాల్లో పంట నష్టం సంభవించింది. ఈ విపత్తుతో 4,801 మంది రైతులు నష్టపోయారు. వరి 2,227.5 హెక్టార్లు, ఉద్యాన పంటలు 2.79 హెక్టార్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఇచ్ఛాపురం 1,118 హెక్టార్లలో వరికి నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారు. పొలాల్లో నీటిని మళ్లించి, సాగును కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు.
News October 29, 2025
ఎచ్చెర్ల: నేడు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు

మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎచ్చెర్ల డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి బుధవారం కూడా సెలవును పొడిగించారు. జిల్లాలో వర్షాలు నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు యూనివర్సిటీతో పాటు జిల్లాలో అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.బీ.అడ్డయ్య మంగళవారం వెల్లడించారు. తుఫాన్ నేపథ్యంలో విద్యార్థులు భద్రత దృష్ట్యా సెలవును ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


