News August 28, 2024
శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ తర్వాతే సచివాలయ ఉద్యోగుల బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీ పూర్తి అయిన తరువాతే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు సంబంధించి రిలీవింగ్ పత్రాలు ఇవ్వాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లకు బుధవారం ఆశాఖ స్టేట్ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు కీలకంగా ఉన్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీ తరువాత బదిలీ అయిన వారిని ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ చేయాలని సూచించారు.
Similar News
News November 5, 2025
శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.
News November 5, 2025
నేడు శ్రీకాకుళం జిల్లా సమీక్ష సమావేశం: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం బుధవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ప్రవాస భారతీయుల సాధికారత సంబంధాల శాఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతుందన్నారు. అజెండాలోని అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించనున్నట్లు వివరించారు.
News November 4, 2025
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్లు ఇన్స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.


