News August 21, 2024
శ్రీకాకుళం: పీవీటీజీ జాతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పివిటిజి) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కలెక్టర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలు, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్, తదితర శాఖలపై ఆయన జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు శ్రీకాకుళం నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
Similar News
News January 3, 2026
దువ్వాడ అడుగు ఎటువైపు ?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News January 3, 2026
శ్రీకాకుళం: Way2Newsకు రిపోర్టర్లు కావలెను

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, గార, కొత్తూరు, జి.సిగడాం మండలాల నుంచి రిపోర్టర్లుగా పని చేసేందుకు Way2News దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు ఈ <
News January 3, 2026
మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


