News July 8, 2024
శ్రీకాకుళం: పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు

శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ఒడిశాలోని పూరీకి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 13వ తేదీ రా.8.00 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు. మరిన్ని వివరాలకు 73829 21647, 99592 25608 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Similar News
News November 21, 2025
శ్రీకాకుళం: ‘టెన్త్ పరీక్షల రాసే విద్యార్థులకు గమనిక’

టెన్త్ పరీక్షలకు వయసు చాలని విద్యార్థుల కండోనేషన్ ఫీజుకు వివరాలను సరి చూసి చెల్లించాలని DEO రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31.08.2025 నాటికి 14 సంవత్సరాలు నిండని విద్యార్థుల https://ose.ap.gov.in వెబ్ సైట్లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజామాన్యం ఈ విషయాన్ని గమనించాలని, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా టెన్త్ పరీక్షల ఫీజును నవంబర్ 30లోగా చెల్లించాలన్నారు.
News November 21, 2025
SKLM: ‘జాబ్ కార్డులు కోసం దరఖాస్తుల స్వీకరణ’

జాబ్ కార్డుల కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయితీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పంచాయతీలలో గల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కేవైసీ కారణంగా ఆలస్యమైన జాబ్ కార్డులు పరిశీలించి ఇస్తామన్నారు.
News November 21, 2025
సంతబొమ్మాళిలో మహిళ దారుణ హత్య!

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమయిందని, మర్డర్కు గురైనట్లు ఎస్సై నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. నందిగామ మండలం కొండబీంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత (34) గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి వరకు పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను పోస్ట్ చేశారు. ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉందన్నారు.


