News June 22, 2024

శ్రీకాకుళం: పెరిగిన మద్దతు ధరతో అన్నదాతకు ఊరట

image

కేంద్ర ప్రభుత్వం 14 రకాల ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరి పంటకు మద్దతు ధర అధనంగా రూ.117 పెంచడంతో క్వింటాకు రూ.2300 చొప్పున రైతులకు గిట్టుబాటు కానుంది.
@ వేరుశనగ క్వింటాకు రూ.406,
@ మొక్కజొన్న రూ.135,
@ రాగి రూ.444,
@ మినుములు రూ.450 చొప్పున పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Similar News

News October 5, 2024

శ్రీకాకుళం: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత

image

అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూతగా నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన హోంగార్డు జి సురేష్ సతీమణి దుర్గ భవానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సహాయంగా స్వతహాగా ఇచ్చిన 4.29 లక్షల నగదు చెక్కును అందజేసి మానవత్వం చాటారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

News October 5, 2024

శ్రీకాకుళంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

image

శ్రీకాకుళంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.69గా ఉంది. నిన్నటితో(110.68)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, లీటర్ డీజిల్ ధర రూ.97.48గా ఉంది. ఇది కూడా నిన్నటి (98.39) ధర కంటే తగ్గింది. ఈనెల తొలి ఐదురోజుల్లో డీజిల్‌కు ఇదే అత్యల్ప ధర.

News October 5, 2024

శ్రీకాకుళం: దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు

image

దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 10,11 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపీటీవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 9 నుంచి విశాఖపట్నం నుంచి పగలు ప్రతి 5నిమిషాలకు, రాత్రి వేళల్లో ప్రతి గంటకు బస్సు చొప్పున జిల్లాకు రాకపోకలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.