News June 19, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్

image

ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు సులభంగా ప్రయాణించేలా ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చినట్లు ఐఆర్‌సీటీసీ రీజనల్ మేనేజర్ డాక్టర్ క్రాంతి తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జూలై 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దేశంలోని సుప్రసిద్ధం పుణ్యక్షేత్రాలకు రూ.16,525 టికెట్ ధరతో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 13, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➧కల్తీ మద్యం వ్యవహారంపై జిల్లాలో పలు చోట్ల వైసీపీ నిరసన
➧ బాలీయాత్రపై సీఎం చంద్రబాబుకు వివరించాం: ఎమ్మెల్యే కూన
➧ కొత్తూరు: నీట మునిగిన పంటను పరిశీలించిన అధికారులు
➧వజ్రపుకొత్తూరు: విద్యాబుద్ధులు నేర్పిన బడిలోనే..టీచర్‌గా చేరింది
➧ ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 వినతులు
➧శ్రీకాకుళం: 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➧టెక్కలి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల గొడవ

News October 13, 2025

ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

image

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News October 13, 2025

నేడు విధుల్లో చేరనున్న నూతన ఉపాధ్యాయులు

image

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 528 మంది నూతన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారని DEO రవిబాబు తెలిపారు. వీరికి ఆన్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి, పోస్టింగ్ ఆర్డర్స్ జారీచేశామని వెల్లడించారు. వీరంతా సోమవారం విధుల్లో చేయనుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నామని DEO పేర్కొన్నారు.