News May 26, 2024
శ్రీకాకుళం: ప్రశాంతంగా డిప్యూటీ డీఈవో పరీక్ష
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు శనివారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆన్లైన్లో ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం)లో 100కు 68 మంది, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల (ఎచ్చెర్ల)లో 100కు 72 మంది పరీక్ష రాశారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రంలో 330 మందికి 233 మంది హాజరయ్యారు.
Similar News
News October 11, 2024
నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ
మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. నిన్న రాత్రికి జిల్లావ్యాప్తంగా 3,427 దరఖాస్తులు అందినట్లు ప్రొహిబిషన్&ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం 825-32 షాపులు, ఆమదాలవలస 268-13, రణస్థలం 502-15, పొందూరు281-10, నరసన్నపేటలో 193-12, కొత్తూరు 178-7, పాతపట్నం 177-8, టెక్కలి 184-11, కోటబొమ్మాళి 224-15, పలాస 154-15, సోంపేట 233-12,ఇచ్చాపురం 208-8 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News October 11, 2024
దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురిపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిపై గురువారం తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తిరుమల క్షేత్రాన్ని దర్శించిన వీరు తిరుమల మాడ వీధుల్లో అభ్యంతరకరంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News October 10, 2024
తెలంగాణ DSCలో కొర్లకోట యువతి సత్తా
ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పేడాడ హిమ శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ పరీక్షలలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో 9వ ర్యాంక్ సాధించింది. ఈమె తండ్రి ప్రభాకరరావు స్కూల్ అసిస్టెంట్గా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. తల్లి గృహిణి. హేమ శ్రీ ఎంపిక పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు అభినందనలు తెలిపాలి.