News April 5, 2024
శ్రీకాకుళం: ఫించన్లు 85 శాతం పంపిణీ

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ నెల అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 3,21,689 మందికి సంబంధించి సొమ్ము విడుదల చేశారు. గురువారం 2,77,353 (86.22శాతం) అందించారు. ఇంకా 44,336 మందికి పింఛన్ డబ్బులను అందించాల్సి ఉంది. సంతబొమ్మాళి (81.40 శాతం), లావేరు (81.56 శాతం), కోటబొమ్మాళి (81.59 శాతం), ఎల్ఎన్పేట (82.57 శాతం), గార (83.02 శాతం), సోంపేట (83.76 శాతం), తదితర మండలాలు పంపిణీలో అట్టడుగున ఉన్నాయి.
Similar News
News October 3, 2025
శ్రీకాకుళం: నేటి నుంచి టీచర్లకు శిక్షణ

శ్రీకాకుళం డీఎస్సీ-2025 ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుక్రవారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలో కొత్తగా ఎంపికైన 534 మంది టీచర్లకు గ్లోబల్ పబ్లిక్ స్కూల్, జే వై హాస్టల్, శ్రీవిశ్వ విజేత జూనియర్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ అనేది ముందుగానే సమాచారం ఇచ్చారు.
News October 3, 2025
శ్రీకాకుళం: గోడ కూలి భార్యాభర్త మృతి

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. మందస మండలం హంసరాలి పంచాయతీ సవర టుబ్బూరులో సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) దంపతులు రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. నిద్రిస్తున్న దంపతులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని హరిపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు.
News October 3, 2025
శ్రీకాకుళం: నేడు ఆ స్కూళ్లకు సెలవు

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని 10 మండలాల పాఠశాలలకు డీఈవో రవికుమార్ సెలవు ప్రకటించారు. నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, శ్రీకాకుళం, హిరమండలం, గార, సరుబుజ్జిలి, ఎల్ఎన్ పేట మండలాల్లోని స్కూళ్లకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఎంఈవోలకు మెసేజ్ పంపారు.