News September 4, 2024
శ్రీకాకుళం: మద్యం ఉద్యోగుల బంద్ నిలుపుదల

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ వైన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా బంద్ చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే విజయవాడలోని వరదల కారణంగా బంద్ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏపీఎస్ బిసియల్ డిపో మేనేజర్ సుబ్బారావుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News October 20, 2025
శ్రీకాకుళంలో నేడు గ్రీవెన్స్ డేలు రద్దు

దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) జరగాల్సిన గ్రీవెన్స్ డేను రద్దు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు కలెక్టరేట్ గ్రీవెన్స్ డే సైతం రద్దు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. వచ్చే సోమవారం యథావిధిగా గ్రీవెన్స్ డే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News October 20, 2025
నేడు పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి

నేడు దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక రద్దు అయింది. ఈ విషయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఒక్క రోజు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని, ప్రజలు గమనించాలని కోరారు.
News October 20, 2025
శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న డీఆర్ఓ

దక్షిణ కాశీగా పేరు ఉన్న జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువైన శ్రీముఖలింగేశ్వర స్వామిని శ్రీకాకుళం డీఆర్ఓ (జిల్లా రెవెన్యూ అధికారి) వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఆ కుటుంబానికి అందించారు. ఆలయ అనువంశిక అర్చకుడు రాజశేఖర్ మధుకేశ్వరుని తీర్థప్రసాదములను, చిత్రపటాన్ని వారికి ఇచ్చారు.