News January 8, 2025
శ్రీకాకుళం: మోదీ సభా స్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అచ్చెన్న
విశాఖపట్నంలో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యవేక్షించారు. పలువురు అధికారులతో వారితో మాట్లాడి సూచనలు చేశారు.
Similar News
News January 23, 2025
జలుమూరు: బ్యానర్లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ
జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.
News January 23, 2025
బొగాబొంద గ్రామంలో అత్యంత విషపూరితమైన పాము
మందస మండలం బొగాబంద గ్రామంలో అత్యంత విషపూరితమైన రణపస పాము కనిపించడం కలకలం రేపింది. స్థానికులు దానిని కొట్టి చంపారు. ఇది కరిస్తే కొద్ది రోజులకు శరీరంపై నల్ల, బంగారం వర్ణంలో మచ్చలు వస్తాయని, ఆపై శరీరం ముక్కలుగా రాలిపోతుందని స్థానికులు తెలిపారు. నల్లటి మచ్చలతో భయం గొలిపేలా ఉండే ఈ పాము శాస్త్రీయ నామం ‘బంగారస్ ఫాసియాటస్’.
News January 23, 2025
జి.సిగడాం: అంత్యక్రియలకు ఏర్పాటు.. అంతలో ట్విస్ట్
మండలంలోని సీతంపేటకి చెందిన ధర్మవరపు అప్పారావు(85) అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే రోగం నయం కాకపోవడంతో బుధవారం హాస్పిటల్ నుంచి గ్రామానికి అంబులెన్స్ లో తీసుకొస్తుండగా చలనం లేకపోవడంతో అప్పారావు మృతి చెందినట్లు బంధువులు భావించారు. ఆపై అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా ఆయన లేచి కూర్చోవడంతో అంతా షాకయ్యారు. ఆయన ఇంకా బతికే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందించారు.