News July 28, 2024
శ్రీకాకుళం: యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News November 28, 2025
SKLM: ఏడు రోజుల మహోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. శుక్రవారం కలెక్టరేట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు సమీక్ష నిర్వహించారు. దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలన్నారు.
News November 28, 2025
శ్రీకాకుళం: ‘రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి’

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఏపీ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ జోగేశ్వరరావు అన్నారు. శాసన సభ అంచనాల కమిటీ 2024-25 ఈ నెల 27,28 తేదీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై కమిటీ సమీక్షిస్తుందన్నారు.
News November 28, 2025
శ్రీకాకుళం జిల్లా రైతులకు తీపి కబురు: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపికబురు అందించిందని రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వంశధార రిజర్వాయర్లో మరో 12 టీఎంసీలు నీరు నింపేందుకు ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం పనులు చేపట్టినా నిధులు విడుదల చేయలేదన్నారు.


