News June 23, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి ‘మీకోసం’

image

మీకోసం పేరుతో ఈనెల 24 నుంచి ప్రజా సమస్యల పరిష్కార, ఫిర్యాదుల వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు.  సోమవారం ఉదయం10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చేపడతామని చెప్పారు. సంబంధిత అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.

Similar News

News October 5, 2024

ఆమదాలవలస: ‘ఖరీఫ్‌‌కు ఈ–పంట, ఈ కేవైసీ తప్పనిసరి’

image

ఖరీప్‌కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

News October 5, 2024

శ్రీకాకుళం: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత

image

అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూతగా నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన హోంగార్డు జి సురేష్ సతీమణి దుర్గ భవానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సహాయంగా స్వతహాగా ఇచ్చిన 4.29 లక్షల నగదు చెక్కును అందజేసి మానవత్వం చాటారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

News October 5, 2024

శ్రీకాకుళంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

image

శ్రీకాకుళంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.69గా ఉంది. నిన్నటితో(110.68)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, లీటర్ డీజిల్ ధర రూ.97.48గా ఉంది. ఇది కూడా నిన్నటి (98.39) ధర కంటే తగ్గింది. ఈనెల తొలి ఐదురోజుల్లో డీజిల్‌కు ఇదే అత్యల్ప ధర.