News April 5, 2024
శ్రీకాకుళం: రేపటి నుంచి పాఠశాలల్లో వార్షిక పరీక్షలు

జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగియనున్నాయి. ప్రశ్న పత్రాలు మండల రిసోర్స్ కార్యాలయం నుంచి పాఠశాల సముదాయాలకు.. అక్కడ నుంచి సంబంధిత పాఠశాలకు ఈ ప్రశ్న పత్రాలు వెళతాయని అధికారులు తెలిపారు.
Similar News
News April 2, 2025
సోంపేట: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగనట్లు ఆయన చెప్పారు. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే ఈ నంబర్ను 9989136143 సంప్రదించాలని ఆయన చెప్పారు.
News April 2, 2025
మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం: అచ్చెన్న

వేటకెళ్లి మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేటకెళ్లిన బుంగ ధనరాజు, వంక కృష్ణ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, మత్స్య శాఖల నుంచి వేరువేరుగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చెరో రూ. పది లక్షలను ఆ కుటుంబాలకు త్వరలో అందజేస్తామన్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
News April 2, 2025
వజ్రపుకొత్తూరు: ఒడ్డుకు కొట్టుకొచ్చిన మత్స్యకారుల మృతదేహాలు

సముద్రంలో గల్లంతైన వజ్రపుకొత్తూరు(M) మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన మత్స్యకారుల మృతదేహాలు బుధవారం ఉదయం అక్కుపల్లి, డోకులపాడు బీచ్ల వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా.. బుంగ ధనరాజు, వంక కృష్ణా గల్లంతై మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.