News January 3, 2025

శ్రీకాకుళం: రేపటి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం రేపటి నుంచి అమలు కానుంది. జిల్లాలో 38 జూనియర్ కళాశాలలో 11028 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరిలో 1787 మంది వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని డీవీఈఓ తవిటి నాయుడు శుక్రవారం తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందిస్తామని ఆయన చెప్పారు.

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ ఘటనలో ఇద్దరు టెక్కలి వాసులు మృతి

image

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 10కి చేరింది. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో టెక్కలి మండలానికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. టెక్కలి(M) రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరి చిన్నమ్మి, పిట్టలసరియాకి చెందిన రాపాక విజయ అనే ఇద్దరు మహిళలు మరణించినట్లు గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల్లో, కుటుంబాల్లో విషాదం నెలకొంది.

News November 1, 2025

కాశీబుగ్గ ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

image

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి <<18167876>>ఆలయ తొక్కిలాట దుర్ఘటన<<>>పై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దేవాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి.. సంఘటన స్థలానికి బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది.

News November 1, 2025

ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.