News January 16, 2025
శ్రీకాకుళం: రేపు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ జరగనుంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
పలాస: రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు

ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదులు స్వీకరణ హోలీ పండగ నేపథ్యంలో రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాశీబుగ్గ పరిసర ప్రాంత ప్రజలు పై విషయాన్ని గమనించి ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమానికి రావద్దని కోరారు.
News March 13, 2025
SKLM: మహిళల భద్రత కోసం శక్తి యాప్- ఎస్పీ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికలు భద్రత కోసం శక్తి యాప్ (SHAKTI APP)ను ప్రవేశపెట్టిందని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించటానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతీ మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 13, 2025
SKLM: ఆత్మహత్యాయత్నం.. రక్షించిన ఆసుపత్రి సిబ్బంది

శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గురువారం ఆసుపత్రి పైఫ్లోర్ నుంచి కిందకు దూకేందుకు యత్నించగా అక్కడి స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన స్పందించి రక్షించారు. సదరు వ్యక్తి సరుబుజ్జిలి మండలం నక్కలపేట వాసిగా స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.