News May 12, 2024

శ్రీకాకుళం: రేపే పోలింగ్.. ఈ నంబర్లు మీకోసమే

image

జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ తెలిపారు. ☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 18,92,457 మంది ☞ పోలింగ్ కేంద్రాలు- 2,358 ☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 520 ☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18004256625 ☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం – 1950

Similar News

News May 7, 2025

శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి అభినందనలు

image

నేడు సీఎం చంద్ర‌బాబు జిల్లా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేయ‌డంలో జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషిచేశార‌ని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. బుడగట్లపాలెం స‌ముద్ర తీర ప్రాంతంలో అనువైన ప‌రిస్థ‌తిని క‌ల్పించి మ‌త్య్స‌కారులతో సీఎం నేరుగా మాట్లాడేందుకు అవకాశం ద‌క్కింద‌న్నారు.

News May 7, 2025

పలాస: మృతదేహం కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు

image

ఉపాధి కోసం పోలాండ్ దేశానికి వెళ్లిన పలాస(M) ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర్(33) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ నెల 21న మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఇప్పటికి 5 రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తక్షణమే అధికారులు, నాయకులు స్పందించి మృతదేహం స్వగ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు.

News May 7, 2025

శ్రీకాకుళం జిల్లాకు వరాలు కురిపిస్తారా?

image

మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు CM చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పి వలసలు అరికట్టేలా ఏదైనా ప్రకటన చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. పైడిభీమవరంలో పారిశ్రామికవాడ, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, కొవ్వాడ అణువిద్యుత్ పరిశ్రమ పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.