News April 4, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సరుబుజ్జిలి మండలం రొట్టవలస సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హిరమండలం మండలం రెల్లివలసకి చెందిన కోట హరి మృతి చెందాడు. సరుబుజ్జిలి ఎస్సై బి.నిహార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస వైపు నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. రొట్టవలస వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా అడ్డం రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మరో యువకుడు గోక రామకోటికి గాయాలయ్యాయి. హరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News February 11, 2026

టెక్కలి: జాబ్ మేళాలో 64 మందికి ఉద్యోగాలు

image

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ అధ్యక్షతన టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 147 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 64 మంది అర్హతల ఆధారంగా పలు కంపెనీలకు ఎంపికయ్యారు. ప్లేస్మెంట్ అధికారి M.వంశీ క్రిష్ణ, IQAC కోఆర్డినేటర్ ల్యూక్ పాల్, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.

News February 11, 2026

SKLM: శైవ క్షేత్రాలకు RTC స్పెషల్ బస్సులు

image

15న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం APSRTC రీజియన్ పరిధిలో అన్ని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం తెలిపారు. PSA డిపో నుంచి సాబకోటకు 10, TKL డిపో నుంచి రావివలసకు 5, SKLM-2 డిపో నుంచి రామతీర్థం 15 బస్సులు, 18న జరగనున్న శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానమహోత్సవానికి 2వ డిపో నుంచి 10, TKL 5 నుంచి బస్సులు నడుపుతామన్నారు.

News February 11, 2026

శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

తపాలా శాఖలో బీపీఎం, ఏబీపీఎం, గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 80 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16లోగా indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000 – రూ.29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470