News February 16, 2025

శ్రీకాకుళం: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

image

శ్రీకాకుళం నగరంలోని ఏపీ.ఎస్.ఆర్టీసీ డిపో 1 లో శనివారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్, డీఎస్పీ వివేకానంద పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతా ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీకాకుళం,టెక్కలి, పలాస డిపోలో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్స్‌గా ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. 

Similar News

News March 28, 2025

వారిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి: కేంద్రమంత్రి రామ్మోహన్ 

image

ఆంధ్రప్రదేశ్‌లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సోండీ, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌కి సిఫారసు చేశారు. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి వీరేంద్ర కుమార్‌తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. వీరిని ఓబీసీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలన్నారు.

News March 27, 2025

వారిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి: కేంద్రమంత్రి రామ్మోహన్ 

image

ఆంధ్రప్రదేశ్‌లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సోండీ, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌కి సిఫారసు చేశారు. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి వీరేంద్ర కుమార్‌తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. వీరిని ఓబీసీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలన్నారు.

News March 27, 2025

పొందూరు: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

పొందూరు- దూసి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి పడడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి, ఎరుపు రంగు షార్ట్, తెలుపు రంగు బనియన్ ధరించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ నెంబర్ 9493474582ను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!