News September 14, 2024

శ్రీకాకుళం రోడ్డు వరకే ప్రయాణించనున్న మెము రైళ్లు

image

పూండి- నౌపాడ, తిలారు- కోటబొమ్మాళి సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ భద్రతా పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, 21 తేదీలలో విశాఖ- పలాస మధ్య ప్రయాణించే మెము రైళ్లను(నం.07470, 07471) శ్రీకాకుళం రోడ్డు వరకే నడపనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్నందున ఆయా తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు- పలాస స్టేషన్ల మధ్య ఈ రైళ్ల రాకపోకలను రద్దు చేశామన్నారు.

Similar News

News November 11, 2025

సమాజాభివృద్ధికి జ్ఞానం అవసరం: ఎస్పీ

image

సమాజాభివృద్ధికి జ్ఞానం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యామంత్రి, జ్ఞాన దీప్తి ప్రతీక అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. అనంరతం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన గొప్ప ఇస్లామిక్ పండితుడని కొనియాడారు.

News November 11, 2025

చిన్నారిపై లైంగిక దాడి.. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

image

నరసన్నపేట మండలానికి చెందిన రెండో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు చల్లా రామ్మూర్తి (70) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విషయాన్ని విద్యార్థిని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, వృద్ధుడిని ఆదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.

News November 11, 2025

విశాఖపట్నంలో గార మండల యువకుడు ఆత్మహత్య

image

విశాఖపట్నంలో గార మండలం కొర్లాం గ్రామానికి చెందిన యువకుడు నల్ల సంపత్ కుమార్ (32) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. యువకుడు విశాఖ ద్వారక నగర్‌లో ఓ గదిలో అద్దెకి ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.