News September 18, 2024
శ్రీకాకుళం: వంద రోజుల కార్యాచరణ లక్ష్యాలపై సమీక్ష

అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కీలక శాఖల 100 రోజుల కార్యాచరణ నివేదికలపై శాఖల వారీగా ఉన్నతాధికారులతో శ్రీకాకుళంలో బుధవారం దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతి, లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్తో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. అందరూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
Similar News
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు వేళాయె..!

సింహాచలం గిరి ప్రదిక్షిణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారి రథం కదలనుంది. 32 కిలోమీటర్ల మేర సాగనున్న ప్రదక్షిణలో సుమారు 5 లక్షలకు పైనే భక్తులు వస్తారని అధికారులు అంచానా వేశారు. తొలిపావంచా నుంచి మొదలయ్యే ప్రదక్షిణ పాత అడివివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, MVPకాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, NAD జంక్షన్, పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోనుంది.
News July 8, 2025
మినీ జెట్టి మంజూరు చేయాలని కేంద్రమంత్రికి వినతి

కేంద్ర మత్స్య శాఖ మంత్రి లాలన్ సింగ్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం దిల్లీలో కలిశారు. పెద్ద గనగలవానిపేట వద్ద మినీ జెట్టి నిర్మాణానికి, ఫిష్ లాండింగ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. మంత్రి అచ్చెంనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వినత పత్రం అందజేయడం జరిగిందని శంకర్ తెలిపారు.
News July 8, 2025
శ్రీకాకుళం: హోంగార్డుకు ‘చేయూత’

ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు పి. జగన్నాధంకు ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది స్వచ్ఛంధగా విరాళం ఇచ్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు నగదు చెక్కు రూ.4.09 లక్షలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.