News April 4, 2024
శ్రీకాకుళం: వడదెబ్బకు వ్యక్తి మృతి

పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ రామకృష్ణ(54) గత కొంతకాలంగా చేపల చెరువుకు
కాపలా కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. తుమరాడ గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువు వద్ద గురువారం ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 1, 2025
శ్రీకాకుళం జిల్లా SP గ్రీవెన్స్కు 61 అర్జీలు.!

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను SP ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. కాగా నేడు మొత్తం 61 అర్జీలు స్వీకరించామన్నారు.
News December 1, 2025
శ్రీకాకుళం జిల్లా SP గ్రీవెన్స్కు 61 అర్జీలు.!

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను SP ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. కాగా నేడు మొత్తం 61 అర్జీలు స్వీకరించామన్నారు.
News December 1, 2025
ధాన్యం రవాణాకు GPS వాహనం తప్పనిసరి: కలెక్టర్

ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.


