News April 4, 2024

శ్రీకాకుళం: వడదెబ్బకు వ్యక్తి మృతి

image

పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ రామకృష్ణ(54) గత కొంతకాలంగా చేపల చెరువుకు
కాపలా కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. తుమరాడ గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువు వద్ద గురువారం ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 26, 2025

ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

image

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.

News November 26, 2025

శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

image

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

News November 26, 2025

శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ఇవే..!

image

శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలాస రెవెన్యూ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, నందిగాం, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. తాజాగా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.