News April 4, 2024

శ్రీకాకుళం: వడదెబ్బకు వ్యక్తి మృతి

image

పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ రామకృష్ణ(54) గత కొంతకాలంగా చేపల చెరువుకు
కాపలా కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. తుమరాడ గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువు వద్ద గురువారం ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News January 23, 2025

జలుమూరు: బ్యానర్‌లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ

image

జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.

News January 23, 2025

బొగాబొంద గ్రామంలో అత్యంత విషపూరితమైన పాము

image

మందస మండలం బొగాబంద గ్రామంలో అత్యంత విషపూరితమైన రణపస పాము కనిపించడం కలకలం రేపింది. స్థానికులు దానిని కొట్టి చంపారు. ఇది కరిస్తే కొద్ది రోజులకు శరీరంపై నల్ల, బంగారం వర్ణంలో మచ్చలు వస్తాయని, ఆపై శరీరం ముక్కలుగా రాలిపోతుందని స్థానికులు తెలిపారు. నల్లటి మచ్చలతో భయం గొలిపేలా ఉండే ఈ పాము శాస్త్రీయ నామం ‘బంగారస్ ఫాసియాటస్’.

News January 23, 2025

జి.సిగడాం: అంత్యక్రియలకు ఏర్పాటు.. అంతలో ట్విస్ట్

image

మండలంలోని సీతంపేటకి చెందిన ధర్మవరపు అప్పారావు(85) అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే రోగం నయం కాకపోవడంతో బుధవారం హాస్పిటల్ నుంచి గ్రామానికి అంబులెన్స్ లో తీసుకొస్తుండగా చలనం లేకపోవడంతో అప్పారావు మృతి చెందినట్లు బంధువులు భావించారు. ఆపై అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా ఆయన లేచి కూర్చోవడంతో అంతా షాకయ్యారు. ఆయన ఇంకా బతికే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందించారు.