News January 31, 2025
శ్రీకాకుళం: విద్యార్థినికి ఐసీయూలో చికిత్స

లైంగిక దాడిలో గాయపడ్డ శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినికి రిమ్స్ ICUలో చికిత్స కొనసాగుతోంది. కాగా విద్యార్థినికి ముఖం, మోచేయిపై తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినికి ఆసుపత్రి వైద్యులు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని కాల్ డేటా, సీసీ ఫుటేజీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు, హోం మంత్రి అనిత ఆరా తీశారు.
Similar News
News July 8, 2025
SKLM: మెగా పీటీఎం 2.0 పై దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

జూలై 10న నిర్వహించబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 పై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దిశా నిర్దేశం చేశారు. సోమవారం శ్రీకాకుళం మండలంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో DEO చైతన్య, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ భోజనం పథకంపై వివరించాలని, విద్యార్థులుకు ఆటల పోటీలపై దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటాలన్నారు.
News July 8, 2025
నరసన్నపేట: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

నరసన్నపేట మండలం ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్ సీ మధుసూదనరావు అందించిన వివరాలు మేరకు మంగళవారం ఉదయం రైలు పట్టాలపై మృతదేహం పడి ఉండడాన్ని గమనించి స్థానికులు సమాచారం అందించారని చెప్పారు. మృతునికి సుమారు 45 ఏళ్లు ఉంటాయని, గులాబీ టీ షర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.
News July 8, 2025
శ్రీకాకుళం: 10న ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా

శ్రీకాకుళంలోని బలగలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంటర్, ఐటిఐ ఫిట్టర్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా మెకానికల్ విద్యార్హత కలిగి 26 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులని తెలిపారు.