News December 28, 2024

శ్రీకాకుళం: విద్యుత్ ధర్నాకు గైర్హాజరైన వైసీపీ ముఖ్య నేతలు

image

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నాయకత్వంలో ధర్నాలు చేపట్టారు. కాగా.. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారు. పలువురు నేతలు కూడా గైర్హాజరయ్యారు.

Similar News

News September 18, 2025

ఎచ్చెర్ల: పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో B.Ed 1, 3వ, B.PEd 1వ సెమిస్టర్ల పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ నేడు ఫలితాలను విడుదల చేశారు. యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్‌ https://brau.edu.in/లో ఫలితాలను అభ్యర్థులు చూడవచ్చునన్నారు.

News September 18, 2025

టెక్కలి: గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి

image

టెక్కలి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు గురువారం పరిశీలించారు. స్థానిక అధికారిణి రూపావతితో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయాల అభివృద్ధికి దోహద పడతాయన్నారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు.

News September 18, 2025

SKLM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మిగిలిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం 28న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 29 న కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.