News June 11, 2024
శ్రీకాకుళం: వేసవి తాపం మళ్లీ మొదలు..

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేసవికాలం పూర్తయినప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి వాతావరణం కొంతమేర చల్లబడినా.. ప్రస్తుతం ఎండలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. మంగళవారం 12 గంటల సమయానికి 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ఉక్కపోత మళ్లీ మొదలైంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News March 21, 2025
ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు.
News March 21, 2025
టెక్కలి: విద్యార్థుల సహనానికి “పరీక్ష”

టెక్కలిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులు మండుటెండలో అవస్థలు పడ్డారు. ఉదయం 8.45 గంటలకు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో మండుటెండలో నిలబడ్డారు. అధికారుల తీరుపై కొంత మంది తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో విద్యార్థులను లోపలికి అనుమతించారు.
News March 21, 2025
సారవకోట: భాను ప్రసాద్కు గేట్లో 38వ ర్యాంక్

సారవకోట మండలం కూర్మనాథపురం గ్రామానికి చెందిన భాను ప్రసాద్ గేట్ పరీక్షలో ప్రతిభ చాటాడు. ఈ మేరకు ఇటీవల విడుదలైన గేట్ ఫలితాలలో 73.75 మార్కులు సాధించి ఆల్ ఇండియాలో 38వ ర్యాంక్ సాధించాడు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగంలో మంచి మార్కులు సాధించి ఈ ఘనత సాధించాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.