News June 21, 2024
శ్రీకాకుళం: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంపు

తొగరం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ పైడి వెంకటరావు గురువారం తెలిపారు. విద్యార్థులు కోర్సుల్లో చేరేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని చెప్పారు. 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో జన్మించి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లా మీదగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. న్యూజల్ పాయ్ గురి నుంచి శ్రీకాకుళం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్పాయ్గురిలో 1:45కు బయలదేరి మరుసటి రోజు సోంపేట-10:44, ఇచ్ఛాపురం-11:01, పలాస-11:46, శ్రీకాకుళం-12:38గంటలకు చేరుకుంటుంది.
News January 16, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇక్కడ సంక్రాంతి మొదలు

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని <<18868852>>కొసమాలలో<<>> దేవాంగుల వీధిలో కనుమ రోజున భోగి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వీధిలోని చేనేత కార్మికులు నేడు భోగి వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. నందిగాం పరిధిలోని పెద్దతామరాపల్లిలోనున్న పెద్దదేవాంగులవీధిలో ఇదే ఆచారాన్ని పాటిస్తారు. మీ పరిధిలో నేటి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటే కామెంట్లో తెలపండి.
News January 16, 2026
ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.


