News November 4, 2024
శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా రెగ్యులర్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు 1305తో కలిపి మొత్తం రూ.1335 చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు కళాశాల యాజమాన్యంకి అందుబాటులోకి రానున్నాయి. 19వ తేదీ నుంచి బీఈడీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి.
Similar News
News November 14, 2025
నౌకా నిర్మాణ హబ్గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్: CM

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్ను నౌకా నిర్మాణ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.
News November 14, 2025
SKLM: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తాం

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తామని ఏపీ మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. NSFC కింద 450 రుణాలుకు 3 వేల దరఖాస్తులందయాని ఆమె వివరించారు. రూ 1.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని త్వరలో ఎంపిక చేసి రుణాలు ఇస్తామన్నారు. అధికారులు గడ్డమ్మ సుజాత పాల్గొన్నారు.
News November 13, 2025
ఎచ్చెర్ల: ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్.ఎం.పురం క్యాంపస్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి క్యాంపస్లో చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కుటుంబీకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది.


