News August 6, 2024

శ్రీకాకుళం: B.Tech పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ ఏయూ B.Tech రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు ఈ నెల 13వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 23, 2025

టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

image

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

News October 23, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➾SKLM: జలజీవన్ మిషన్‌పై సమీక్ష
➾రావివలస ఎండల మల్లన్న దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తా: అచ్చెన్న
➾శ్రీకాకుళంలో వైసీపీ రచ్చబండ
➾ప్రజా సమస్యలను పరిష్కరించాలి:ఎమ్మెల్యే శిరీష
➾జలమూరు: ప్రధాన రహదారిపై నిలిచిన నీరు
➾బూర్జ: లక్కుపురంలో కుళాయిలు నుంచి బురద నీరు
➾SKLM: విద్యార్థులకు అసెంబ్లీలో పాల్గొన్న అవకాశం
➾ఆముదాలవలసలో కుక్కలు స్వైరవిహారం

News October 22, 2025

పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

image

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్‌ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.