News April 17, 2025
శ్రీకాకుళం DMHO, సీసీ సస్పెండ్

శ్రీకాకుళం డీఎంహెచ్ఓ టి. బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడో తేదీన ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News January 2, 2026
నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.
News January 2, 2026
SKLM: న్యూ ఇయర్ కిక్..రూ. 3.75 కోట్ల మద్యం తాగేశారు

శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న ఉదయం-రాత్రి వరకు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అమ్మకాల ద్వారా రూ3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సీహెచ్ తిరుపతిరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 176 మద్యం షాపులు, 9 బార్లు ఉన్నాయని ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగాయాన్నారు.
News January 2, 2026
శ్రీకాకుళం: న్యూ ఇయర్ వేడుకలు.. 36 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సోదాల్లో 36 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, 15 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేర నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.


