News November 8, 2024

శ్రీకాకుళం: DSC అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసే DSC ఉపాధ్యాయ పోస్టుల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 10వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. ఈ టెస్ట్ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే హాల్ టికెట్లు జ్ఞానభూమి వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Similar News

News January 10, 2026

కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు

image

కొత్తూరు మండల కేంద్రంలో ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. కొత్తూరు నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఈ ఇబ్బందులు తప్పలేదు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇలా కిక్కిరిసి గమ్యస్థానాలకెళ్లారు. ఫ్రీ బస్సు, పండగ రద్దీ కూడా దీనికి తోడైంది. అధికారులు స్పందించి తగినన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News January 10, 2026

శ్రీకాకుళం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మహేశ్ (27) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. ఏడాది క్రితం పలాస మండలానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం కాశీబుగ్గలో నివాసం ఉంటున్నారు. ఇరువురు మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News January 10, 2026

SKLM: వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

image

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్‌ విజయ సారధి హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేయరాదన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.