News June 28, 2024
శ్రీకాకుళం: ITIలో 3,608 సీట్లకు 826 ప్రవేశాలు

శ్రీకాకుళం జిల్లాలోని ఐటీఐలో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,470 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,608 సీట్లు గాను కేవలం 826 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 23 ఐటిఐ కళాశాలల్లో 2,782 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనితో విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు.
Similar News
News July 5, 2025
రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కి తరలించారు.
News July 5, 2025
SKLM: ‘SC ఇంటర్ విద్యార్థులకు అకౌంట్లోకి తల్లికి వందనం’

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు జమ అవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 -26 విద్యా సంవత్సరంలో కాలేజీలో జాయిన్ అయి, వారి బ్యాంక్ అకౌంటుకు NPCI లింకు చేయాలని పేర్కొన్నారు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో వ్యక్తిగత ఖాతా ఓపెన్ చేయాలని తెలిపారు.
News July 5, 2025
శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు శుభవార్త

శ్రీకాకుళం రోడ్ పలాస మీదుగా SMVT బెంగుళూరు(SMVB)- నారంగి(NNGE) మధ్య నడుస్తున్న 2 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడిచేలా పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06559 SMVB- NNGE రైలు జులై 8, 15 తేదీలలో, నం.06560 NNGE- SMVB మధ్య నడిచే రైలు జులై 12, 19 తేదీలలో ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.