News August 7, 2024

శ్రీకాకుళం: ITI ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తు

image

శ్రీకాకుళం జిల్లాలో ఐటిఐలో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్, జిల్లా ప్రవేశాల కన్వీనర్ ఎల్. సుధాకర్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌లో మిగిలిన సీట్ల ప్రవేశాలు కల్పిస్తామని ఆయన వివరించారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 26వ తేదీతో గడువు ముగుస్తుందని ఆయన చేప్పారు.

Similar News

News January 3, 2026

మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

image

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 3, 2026

శ్రీకాకుళం: B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 14 B.Ed కళాశాల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 1,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

News January 3, 2026

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.