News February 27, 2025

శ్రీకాళహస్తిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

శ్రీకాళహస్తి లోని మహాశివరాత్రి సందర్భంగా వాయు లింగేశ్వర స్వామి వారి బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి, భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా శివరాత్రి మహోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడ తోపులాట జరగకుండా చూడాలని ఆదేశించారు.

Similar News

News November 21, 2025

NLG: కొత్త రూల్స్ అమలు.. దరఖాస్తులు షురూ

image

కంకర మిల్లులకు ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సమూల మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది. దీంతో జిల్లాలో 20 క్రషర్ మిల్లుల యజమానులు, 150 టిప్పర్ల యజమానులు కూడా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం మైనింగ్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.

News November 21, 2025

ADB: లోకల్ వార్.. అయోమయంలో బీసీలు

image

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రతిష్ఠ కొనసాగుతుండటంతో పార్టీ పరంగా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆమోదించాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1514 GPలు, 581 ZPTC, 69 MPTC స్థానాలు ఉండగా.. బరిలో నిలవాలనుకున్న బీసీలు అయోమయంలో ఉన్నారు.

News November 21, 2025

వరంగల్‌: రేపు జాబ్ మేళా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. సాత్విక కోరారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మేళాకు అర్హులన్నారు.