News February 27, 2025
శ్రీకాళహస్తిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

శ్రీకాళహస్తి లోని మహాశివరాత్రి సందర్భంగా వాయు లింగేశ్వర స్వామి వారి బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి, భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా శివరాత్రి మహోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడ తోపులాట జరగకుండా చూడాలని ఆదేశించారు.
Similar News
News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
News November 20, 2025
ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News November 20, 2025
గాంధీ ఆస్పత్రికి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు చర్యలు

HYD గాంధీ ఆస్పత్రికి కొత్త బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం అధికారులు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను సందర్శించి అక్కడి అధునాతన వైద్య విధానాలను పరిశీలించారు. కార్పొరేట్ స్థాయి సేవలు అందించే విధంగా గాంధీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత మోడల్స్కు ఆమోదం వచ్చిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయన్నారు.


