News July 7, 2024
శ్రీకాళహస్తి: ఆశ చూపి మోసం చేశారని కేసు

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీకి చెందిన సుధ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహారావు కథనం మేరకు.. ఓ ప్రకటనల కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో పెద్దఎత్తున ఆదాయాలు పొందవచ్చునని నర్మద కుటుంబ సభ్యులు సుధాని నమ్మించారు. దీంతో ఆమె ఏడాది పాటు రూ.39లక్షలు అందజేసింది. చివరికి ఇంటికి తాళంవేసి పరారయ్యారు.
Similar News
News January 7, 2026
క్రీడా పరికరాలు అందించిన చిత్తూరు కలెక్టర్

చిత్తూరు వికలాంగుల క్రీడా సంఘం సభ్యులు రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ను బుధవారం కలిశారు. మరిన్ని విజయాలు సాధించేందుకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు. వారి వినతి మేరకు.. షటిల్ బ్యాట్స్ 6, షూస్ 10 జతలు, జావెలిన్ 2, షాట్ పుట్ 2, షటిల్ కాక్ బాక్సులు రెండు వారికి కలెక్టర్ అందించారు. వారిని అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
News January 7, 2026
దొంగలపై 181 కేసులు.. చిత్తూరులో చిక్కారు.!

చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన <<18789584>>దొంగల<<>> వివరాలు.. గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య (49), పల్నాడు జిల్లా నారాయణపురానికి చెందిన నాగుల్ మీరా(27), గుంటూరు జిల్లా సంగడి గుంటకు చెందిన తులసి రామిరెడ్డి (27)ని పోలీసులు అరెస్టు చేశారు. వెంకయ్యపై 100 కేసులు, నాగుల్ మీరాపై 75 కేసులు, తులసి రామిరెడ్డి పై ఆరు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
News January 7, 2026
9 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


