News March 22, 2025

శ్రీకాళహస్తి తిరుచ్చిపై జ్ఞాన ప్రసూనాంబ దర్శనం

image

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తికి అలంకారాలు చేశారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.

Similar News

News December 10, 2025

అల్లూరి: ఫోన్‌ ఎక్కువ మాట్లాడొద్దని మందలించిన భర్తను చంపిన భార్య

image

భర్తను భార్య హత్య చేసిన ఘటన చింతపల్లి మండలం మేడూరులో జరిగింది. భార్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని మందలించడంతో భర్త రాజారావుపై గొడ్డలితో భార్య దాడి చేసింది. తీవ్ర గాయాలైన రాజారావును స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

News December 10, 2025

MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.

News December 10, 2025

NGKL: పొలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరగాలి: కలెక్టర్

image

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియతో పాటు ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. రేపు ఉదయం 7 గంటలకు 137 గ్రామ పంచాయతీలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బందితో పాటు అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధులకు 6000 మందికిపైగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.