News March 22, 2025

శ్రీకాళహస్తి తిరుచ్చిపై జ్ఞాన ప్రసూనాంబ దర్శనం

image

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తికి అలంకారాలు చేశారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.

Similar News

News December 16, 2025

1,160 మందితో బందోబస్తు: సంగారెడ్డి ఎస్పీ

image

జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే 8 మండల గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,160 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఉంటుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

News December 16, 2025

అనంతగిరి ఎంపీపీ పదవి నుంచి శెట్టి నీలవేణి తొలగింపు

image

అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిని ఎంపీపీ పదవి నుంచి తొలగిస్తూ సంబంధిత ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీపీ నీలవేణిపై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో ప్రిసైడింగ్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు అక్టోబరు 30న అనంతగిరిలో సమావేశం నిర్వహించారు. 11 మంది ఎంపీటీసీ సభ్యులు నీలవేణికి వ్యతిరేకంగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది.

News December 16, 2025

ఎన్నికలు ముగిసే వరకు BNS-163 చట్టం అమలు: CP

image

3వ విడత GPఎన్నికలు ముగిసే వరకు BNS-163 వ చట్టం అమలులో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. ఈనెల 17న సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల పరిధిలో చట్టం వర్తిస్తుందన్నారు. సభలు, ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల సందర్భంగా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును నియోగించుకోవాలన్నారు.