News March 22, 2025

శ్రీకాళహస్తి తిరుచ్చిపై జ్ఞాన ప్రసూనాంబ దర్శనం

image

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తికి అలంకారాలు చేశారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.

Similar News

News March 23, 2025

పెద్ద పట్నం కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్మన్

image

ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పెద్ద పట్నం, మల్లిఖార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News March 23, 2025

ప.గో: పది నెలల పాటు జైలులోనే బాల్యం..!

image

పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన పసల కృష్ణమూర్తి – అంజలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణ భారతి ఆదివారం మృతి చెందారు. భీమవరం సబ్ కలెక్టరేట్ వద్ద జెండా ఎగురవేసిన సందర్భంలో కృష్ణ భారతి తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవించారని గ్రామస్థులు తెలిపారు. నాడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. జైలులోనే కృష్ణ భారతికి అంజలక్ష్మి జన్మనిచ్చారు. కృష్ణ భారతి బాల్యం మొదటి పది నెలలు జైలులోనే గడిపారని తెలిపారు.

News March 23, 2025

రేపు అధికారులతో మంత్రి సుభాష్ ప్రత్యేక సమావేశం

image

రామచంద్రపురం నియోజవర్గంలో సాగు నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకునేందుకు ఈ నెల 24న ఇరిగేషన్ శాఖ అధికారులతో  మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ (DC) అధ్యక్షులు, కార్యదర్శులు, రైతులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!